శుక్రవారం, 27 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 18 ఫిబ్రవరి 2017 (13:17 IST)

వారు ఎమ్మెల్యేలు కాదు.. రౌడీలు... డీఎంకే సభ్యులపై స్వామి ఫైర్

తమిళనాడు రాష్ట్రంలోని డీఎంకే ఎమ్మెల్యేలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. వారు ఎమ్మెల్యేలు కారనీ, రౌడీలు అంటూ మండిపడ్డారు. వీరికంటే.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శ

తమిళనాడు రాష్ట్రంలోని డీఎంకే ఎమ్మెల్యేలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. వారు ఎమ్మెల్యేలు కారనీ, రౌడీలు అంటూ మండిపడ్డారు. వీరికంటే.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఎంతో మేలని ఆయన వ్యాఖ్యానించారు. 
 
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో శనివారం జరిగిన సంఘటనలపై ఆయన స్పందిస్తూ... ఆ పార్టీని హింసాత్మక, జాతి వ్యతిరేక పార్టీ అని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య వేదికపై గొడవ చేసిన తీరును చూస్తే డీఎంకే కంటే శశికళ ఎంతో నయమన్నారు. తమిళనాడు అసెంబ్లీలో వాలి, సుగ్రీవుల మధ్య యుద్ధం జరుగుతోందని చెప్పుకొచ్చారు.
 
డీఎంకే సభ్యులు హిందూ వ్యతిరేకులు.. దేవాలయాలు ధ్వంసం చేసే పార్టీ అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్‌ ప్రక్రియపై తక్షణమే గవర్నర్‌ జోక్యం చేసుకోవాలన్నారు. పళనిస్వామికి పూర్తి మెజారిటీ ఉంది, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. డీఎంకే సభ్యులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారంటూ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడును జాతివ్యతిరేక సభ్యుల నుంచి కాపాడాలంటూ ఆయన స్పీకర్‌‌ను కోరారు.