శనివారం, 1 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 8 డిశెంబరు 2016 (15:28 IST)

అమ్మ మరణం చేదు నిజం.. జీర్ణించుకోలేక 77 మంది కన్నుమూత.. ఆ రోజు అమ్మ క్యాంటీన్లు మాత్రం..?

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గుండెపోటుతో డిసెంబర్ 5వ తేదీన తుదిశ్వాస విడిచారు. దీంతో తమిళ రాష్ట్రమంతా విషాదంలో మునిగిపోయింది. అమ్మ తమను అనాథలను చేసి వెళ్లిపోయిందంటూ ప్రజలు దీనంగా రోదించారు. ఈ చేదు నిజా

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గుండెపోటుతో డిసెంబర్ 5వ తేదీన తుదిశ్వాస విడిచారు. దీంతో తమిళ రాష్ట్రమంతా విషాదంలో మునిగిపోయింది. అమ్మ తమను అనాథలను చేసి వెళ్లిపోయిందంటూ ప్రజలు దీనంగా రోదించారు. ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేక 77 మంది మరణించారు. జయలలిత చనిపోయిందని తెలియగానే తమిళనాడులోని దుకాణాలు, హోటళ్లు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. 
 
విద్యాసంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. కానీ ఒక్కచోట మాత్రం తలుపులు తెరిచే ఉంచారు. తమ సేవలను కొనసాగించారు. అవే అమ్మ క్యాంటీన్లు. పేద ప్రజల ఆకలిని తీర్చేందుకు 5రూపాయలకే భోజనం పెట్టే కార్యక్రమానికి జయలలిత శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
 
జయలలిత చనిపోయిందన్న వార్త తెలియగానే అమ్మ క్యాంటీన్లను కూడా మూసేద్దామనుకున్నామని, కానీ ఆమె సంకల్పానికి తూట్లు పొడవడం ఇష్టం లేక ఆ తర్వాత కూడా క్యాంటీన్లను కొనసాగించామని నిర్వాహకులు తెలిపారు. అమ్మ ప్రతిక్షణం ప్రజల కోసం పరితపించేవారని, ఇలా ప్రజల ఆకలి తీరిస్తేనే ఆమె ఆత్మ శాంతిస్తుందనే ఉద్దేశంతోనే తమ సేవలు కొనసాగించినట్లు తెలిపారు. ఏదేమైనా వీరి ఉద్దేశం బాగుందని పలువురు అభినందిస్తున్నారు.