బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 నవంబరు 2022 (10:12 IST)

గద్దలకు ట్రైనింగ్ ఇస్తున్న ఇండియన్ ఆర్మీ

eaglestraining
ఇండియన్ ఆర్మీ గద్దలకు శిక్షణ ఇస్తుంది. గద్దలకు శిక్షణ ఏంటి అనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. ఇటీవలి కాలంలో పాకిస్థాన్ సరిహద్దులకు ఆవల నుంచి భారత గగనతలంలోకి డ్రోన్సు చొరబడుతున్నాయి. ఈ బెడద ఇటీవలి కాలంలో ఎక్కువైంది. తాజాగా కూడా మాదకద్రవ్యాలతో వచ్చిన ఓ డ్రోన్‌ను కూడా భద్రతా బలగాలు గుర్తించి కూల్చివేశాయి. 
 
అయితే, పాకిస్థాన్ వంటి శత్రు దేశాల నుంచి వచ్చే డ్రోన్లను గుర్తించి వాటిని కూల్చివేశాలా ఇండియన్ ఆర్మీ గద్దలకు శిక్షణ ఇస్తుంది. గాల్లో ఎగిరే డ్రోన్లను అడ్డుకునేలా వీటికి ట్రైనింగ్ ఇస్తున్నారు. డ్రోన్లను కట్టడి చేసేందుకు వీలుగా గద్దలను ప్రయోగించడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. 
 
భారత్ అమెరికా దేశాలు సంయుక్తంగా చేపట్టిన సైనిక విన్యాసాలైన యుద్ధ్ అభ్యాస్‌లో భాగంగా గద్దలు డ్రోన్లను కూల్చివేయడాన్ని ప్రదర్శించారు. ఓ డ్రోన్‌ను ఆర్మీ సిబ్బందిగాల్లో ఎగురవేయగా దాన్ని ఆర్మీకే చెందిన ఓ శునకం దాన్ని గుర్తించి సిబ్బందిని అప్రమత్తం చేసింది. 
 
ఆ వెంటనే మరో సిబ్బంది తన వద్ద ఉన్న శిక్షణ పొందిన గద్దను డ్రోన్ దిశగా గాల్లోకి వదిలారు. ఆ గద్ద డ్రోన్‌ను గుర్తించి విజయవతంగా నేలకూల్చింది. ఆ గద్ద పేరు అర్జున్. డ్రోన్లను గుర్తించడంతో గద్దలకే కాదు శునకాలకు సైతం భారత్ సైన్యం శిక్షణ ఇవ్వడం గమనార్హం.