మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 27 ఆగస్టు 2016 (16:02 IST)

దోపిడీ, అత్యాచారం, హత్య.. మూడూ ఒకే ఇల్లు, ఒకే రాత్రిలో జరిగింది... ఎక్కడ?

ఓ ఇంట్లో దోపిడీకి పాల్పడేందుకు వెళ్ళిన దుండగులు ఓ మహిళ, బాలికపై అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా.. ఆ ఇంటికి చెందిన దంపతులను పొట్టనబెట్టుకున్న ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. హర్యానా, మీవట్ ప్రాంతానికి చె

ఓ ఇంట్లో దోపిడీకి పాల్పడేందుకు వెళ్ళిన దుండగులు ఓ మహిళ, బాలికపై అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా.. ఆ ఇంటికి చెందిన దంపతులను పొట్టనబెట్టుకున్న ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. హర్యానా, మీవట్ ప్రాంతానికి చెందిన ఓ ఇంట్లో దోపిడి చేసేందుకు దుండగులు.. ఇంట్లో ఉన్న వారిని కట్టిపడేశారు. ఆపై అదే ఇంటికి చెందిన బాలికతో పాటు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు.
 
అంతటితో ఆగకుండా ఆ ఇంట్లో నివసించే దంపతులను హత్య చేశారు. నగలు, నగదు దోచుకెళ్లారు. ఇదంతా ఒక రాత్రిలోనే జరిగిపోయింది. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగలను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటన హర్యానాలో కలకలం సృష్టించింది.