మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr

ఏం కష్టమొచ్చిందో... ఢిల్లీలో దంపతుల ఆత్మహత్య

దేశరాజధాని ఢిల్లీలోని ఓ ఇంట్లో దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఉత్తరాఖండ్‌కు చెందిన వీరు గతేడాది నుంచి మయూర్‌ విహార్‌ ప్రాంతంలోని ఓ ఇంట్లో నివాసముంటున్నారు. కాగా శనివారం వీరు తమ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించారు. 
 
సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆ ఇంట్లో పురుగుల మందు లభించడంతో వీరు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.