శుక్రవారం, 25 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (11:55 IST)

పరువు నష్టం దావా కేసులో మేధా పాట్కర్ అరెస్టు

medha patkar
పరువు నష్టం దావా కేసులో సామాజిక కార్యకర్త, నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమకారిణి మేధా పాట్కర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 2000 నాటి ఈ కేసును ప్రస్తుత ఢిల్లీ ఎల్జీగా ఉన్న వీకే సక్సేనా దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం పోలీసులను ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమెను కోర్టులో పరిచి రిమాండ్‌కు తరలించనున్నారు. 
 
మేధా పాట్కార్, వీకే సక్సేనాల మధ్య 2000 సంవత్సరం నుంచి న్యాయపోరాటం సాగుతోంది. నర్మదా బచావో ఆందోళన్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు ప్రచురించగానే ఆరోపణలపై వీకే సక్సేనాపై ఆమె అప్పట్లోకేసు పెట్టారు. ఆ సమయంలో ఆమమె అహ్మదాబాద్ కేంద్రంగా ఉన్న నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే ఎన్జీవోకు చీఫ్‌గా ఉన్నారు.