1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 4 మే 2020 (20:36 IST)

కరోనా సోకిన యువకుడిపై డాక్టర్ అత్యాచారం..!

కామంతో కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తున్నారు కొంతమంది. ఆరోగ్యంగా ఉన్నారా..? లేదా అని చూడకుండా జంతువుల కంటే హీనంగా మానవ మృగాలు ప్రవర్తిస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. ముంబై లోని ఓ డాక్టర్ కరోనా రోగి పై అత్యాచారానికి ఒడి గట్టాడు. ఓ మగ పేషంట్ పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నవీ ముంబై మెడికల్ కాలేజ్‌లో చదివిన ఓ డాక్టర్ (33) గత నెలాఖరులో ఆస్పత్రిలో డాక్టర్ గా చేరాడు.

కాగా అదే ఆస్పత్రిలో కరోనాతో బాధపడుతున్న 44 ఏళ్ల పురుషుడికివైద్యం అందించే సాకుతో ఐసీయూలోకి వెళ్లాడు. అక్కడ ఎవరు లేని విషయాన్నీ గమనించి అత్యాచారం చేశాడు.

దీంతో అలారం మోగించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.వెంటనే ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో డాక్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతన్ని థానేలోని తన ఇంట్లోనే హోం క్వారంటైన్ చేశారు.

ఇది ఇలా ఉండగా.. ఇప్పటివరకు ఆ ఆస్పత్రిలోని డాక్టర్లు, నర్సులు కలిపి 80 మందికి కరోనా సోకింది. దీంతో నెలరోజులపాటు ఆస్పత్రిని మూసివేసి ఉంచారు.

ఏప్రిల్ 23న ఆస్పత్రి తెరిచారు. ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో అందరూ చర్చించుకుంటున్నారు.