శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 26 సెప్టెంబరు 2018 (18:33 IST)

అర్థరాత్రి 11 గంటలకు ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో భార్య.. ఉన్నట్టుండి భర్త ఇంటికొచ్చాడు..

సోషల్ మీడియాతో ఎంత మేలు జరుగుతుందనే విషయాన్ని పక్కనబెడితే.. వాటి కారణంగా నేరాలు సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. సోషల్ మీడియా మోజులోపడి.. చాలామంది మానవీయ విలువలను మరిచిపోతున్నారు. ఫేస్‌బుక్ పరిచయంతో ఎవరితో

సోషల్ మీడియాతో ఎంత మేలు జరుగుతుందనే విషయాన్ని పక్కనబెడితే.. వాటి కారణంగా నేరాలు సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. సోషల్ మీడియా మోజులోపడి.. చాలామంది మానవీయ విలువలను మరిచిపోతున్నారు. ఫేస్‌బుక్ పరిచయంతో ఎవరితో పడితే వారితో ప్రేమలో పడటం.. వాటికోసం నేరాలకు పాల్పడటం మామూలైపోయింది. తాజాగా ఫేస్‌బుక్ పరిచయం మరోసారి పచ్చని సంసారంలో చిచ్చు పెట్టింది. 
 
ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తితో భార్య సన్నిహితంగా వుండటం చూసిన భర్త ఆగ్రహంతో ఊగిపోయాడు. అంతటితో ఆగకుండా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెన్నై కీల్‌పాకం పెరుమాళ్ వీధికి చెందిన కిషోర్ కోఠారి ద్విచక్రవాహనాలకు ఫైనాన్స్ చేస్తూ ఉంటాడు. రాజస్థాన్‌కు చెందిన ఇతనికి సీమా అనే మహిళతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. 
 
వీరికి పిల్లలు లేరు.. ఈ దంపతులతో పాటు సీమా చెల్లెలు బేబీ నివసిస్తున్నారు. సీమా, బేబీలకు రాజస్థాన్‌కు చెందిన రవిప్రకాశ్ అనే యువకుడితో మూడు నెలల క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. దీంతో నాటి నుంచి మేసెంజర్‌లో ఛాట్ చేసుకుంటూ వస్తున్నారు.
 
కిశోర్ కోఠారి బయటికి వెళ్లగానే అతని ఇంటికి వచ్చి అక్కచెల్లెళ్లతో మాట్లాడేవాడు. మంగళవారం రవిప్రకాశ్.. కిషోర్ ఇంటికి వచ్చాడు. అయితే కిశోర్ 11 గంటల సమయంలో ఉన్నట్టుండి ఇంటికి రావడంతో.. సీమా కంగారుపడింది.. భార్యతో పరాయి వ్యక్తి సన్నిహితంగా ఉండటం చూసి కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 
 
ఆ సమయంలో సీమా వంటింట్లోని కత్తి తీసుకుని కిశోర్‌పై దాడి చేసింది. దీనిపై కీల్‌పాకం పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకుని గాయపడిన కిషోర్‌ను ఆస్పత్రిలో చేర్చారు. ఈ కేసుకు సంబంధించి సీమా, బేబీ, రవిప్రకాశ్‌లను పోలీసులు విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.