మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 జనవరి 2024 (20:58 IST)

ఆయన పాలనలో మద్యపానం నిషేధం... అందుకే భారతరత్న అవార్డు?

Karpuri Thakur
Karpuri Thakur
వెనుకబడిన తరగతుల పోరాటానికి ఎంతగానో కృషి చేసిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ భారతరత్న అవార్డు లభించింది. కర్పూరి ఠాకూర్ (24 జనవరి 1924 - 17 ఫిబ్రవరి 1988) బిహార్‌కు చెందిన రాజకీయవేత్త, జన్ నాయక్ అని ముద్దుగా ఈయన్ని పిలుస్తారు.
 
సోషలిస్ట్ పార్టీ/భారతీయ క్రాంతి దళ్ క్రింద డిసెంబరు 1970 నుండి జూన్ 1971 వరకు, తరువాత డిసెంబర్ 1977 నుండి ఏప్రిల్ 1979 వరకు జనతా పార్టీలో భాగంగా వరుసగా రెండు సార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
 
బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలోని పితౌంఝియా (ప్రస్తుతం కర్పూరి గ్రామ్) గ్రామంలో జన్మించిన ఠాకూర్ తన విద్యార్థి ప్రాయంలో జాతీయ భావాలతో తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఇంకా విద్యార్థి కార్యకర్తగా క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నందుకు 26 నెలల జైలు జీవితం గడిపారు. స్వాతంత్ర్యం తర్వాత, ఠాకూర్ రాజకీయాల్లోకి రాకముందు ఉపాధ్యాయుడిగా పనిచేశారు.
 
రాజకీయ వ్యక్తిగా, ఠాకూర్ వివిధ సామాజిక , రాజకీయ కార్యక్రమాలలో కీలక పాత్ర పోషించారు. అతను అణగారిన వర్గాల కోసం పాటుపడ్డారు. భూసంస్కరణల కోసం కృషి చేశారు. ఠాకూర్ మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు.
 
1970లో బీహార్‌లో మొదటి కాంగ్రెసేతర సోషలిస్ట్ ముఖ్యమంత్రి అయ్యారు. ఠాకూర్ పరిపాలనలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులోకి వచ్చింది.