1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

30 సంవత్సరాలు మాత్రమే జీవించాలని నిర్ణయం.. ఆ వయసు రాగానే ఆత్మహత్య.. ఎక్కడ?

gunshot
ఆ యువకుడు కేవలం మూడు పదుల వయస్సు వరకు మాత్రమే జీవించాలని నిర్ణయించుకున్నాడు. ఇపుడు ఆ వయసు రాగానే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇండోర్‌లోని హిరా నగర్ ప్రాంతంలోని అతడి ఇంట్లో రక్తపు మడుగులో పడివున్న యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో పోలీసులు ఆ ఇంటికి వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తన స్వీయ రక్షణ కోసం 2016లో తీసుకున్న తుపాకితోనే కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నట్టు గుర్తించారు. తాను జీవితాన్ని ముగిస్తున్నానని, దీనికి ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్‌లో రాసినట్టు పోలీసులు తెలిపారు.
 
'30 సంవత్సరాల వరకు మాత్రమే జీవించాలని 9 ఏళ్ల క్రితమే నిర్ణయించుకున్నా. నాకు జీవితంలో ఎలాంటి బాధలు లేవు' అని అతడు ఆ నోట్లో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. లేఖను బట్టి చూస్తే అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు అర్థమవుతోందని, అయినప్పటికీ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.