వంట సరిగ్గా వండలేదని కొబ్బరి తురుముతో భార్యను హత్య చేసేశాడు.. ఎక్కడ?
కుటుంబ విలువలు మంటగలిసిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే హత్యలు పెరిగిపోతున్నాయి. భార్యాభర్తల అనుబంధాలు మంటగలుస్తున్నాయి. చిన్న కారణాలకే హత్యలకు పాల్పడున్న వ్యక్తుల సంఖ్య తగ్గట్లేదు. తాజాగా భార్య వంట సరిగా చేయలేదనే కోపంతో భర్త నరికి నరికి చంపాడు.
ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మాగడి సమీపంలోని మత్తికెరెలో రంగయ్య (68), తిమ్మమ్మ (65) దంపతులు ఎన్నో ఏళ్లుగా కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతాయని స్థానికుల సమాచారం మేరకు దర్యాప్తులో తేలింది.
అయితే బుధవారం రాత్రి వంట చేసే విషయంలో భార్య తిమ్మమ్మతో భర్త రంగయ్య గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ కాస్త పెద్దదిగా మారడంతో ఆమెపై దాడి చేశాడు. కొబ్బరి తురిమే పీటతో నరికి హత్య చేశాడు.
ఆ రాత్రి అక్కడే వుండి.. పొద్దున్నే తిరుపతికి పారిపోవాలనుకున్నాడు. కానీ స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం చేరవేయడంతో రంగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.