1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 జూన్ 2025 (17:14 IST)

ప్రియురాలి కోరిక మేరకు ఆమె భర్తను హత్య చేసిన ప్రియుడు...

murder
తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్‌లో ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ దారుణ హత్య కేసును మరిచిపోకముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోరం జరిగింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను తన ప్రియుడుతో హత్య చేయించిందో వివాహిత. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా గ్రామీణ మండలం అక్కంపల్లి - రాచానపల్లి రోడ్డులో చోటుచేసుకుంది. 
 
పోలీసుల కథనం మేరకు.. అక్కంపల్లిలో చిన్న హోటల్ నిర్వహిస్తున్న సురేశ్ బాబు అనే వ్యక్తి హత్య ఘటన వెలుగులోకి వచ్చిన కేవలం ఆరు గంటల్లో ఈ కేసును ఛేదించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో సురేశ్ భార్య, ఆమె ప్రియుడు ఫక్రుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాలను ఎస్పీ ఏర్పాటుచేశారు.
 
సురేశ్ చంపాలని అతడి భార్య అనిత తన ప్రియుడు ఫక్రుద్దీన్‌ను ఉసిగొల్పడంతో ఈ దారుణం జరిగినట్టు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి హోటల్ మూసి ఇంటికి వస్తున్న ఫక్రుద్దీన్‌ను అనిత ప్రియుడు పెద్ద బండరాయితో తలపై కొట్టడం వల్లే సురేష్ చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఈ హత్య జరిగిన కేవలం ఆరు గంటల్లోనే కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేయడం గమనార్హం.