శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సందీప్
Last Updated : సోమవారం, 25 మార్చి 2019 (18:39 IST)

ఎన్నికల తర్వాత పాకిస్థాన్‌లో విషాద ఛాయలు: విజయ్ రూపానీ

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నాయకులు, అభ్యర్థుల మధ్య విమర్శల తూటాలై పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు నిందించడం ఈరోజు కొత్తేమీ కాదు. తాజాగా భాజపా నేత, గుజారాత్‌ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. 
 
ఈసారి ఎన్నికల్లో పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే పాకిస్థాన్‌లో దీపావళి జరుపుకొంటారని వ్యాఖ్యానించారు. "కానీ ఇది జరగకపోవచ్చు, దేశ ప్రజలు మాత్రం మళ్లీ నరేంద్ర మోడీకే పట్టం కడతారు. దీంతో పాకిస్థాన్‌లో విషాద ఛాయలు అలముకుంటాయి’’ అని ‘విజయ్‌ సంకల్ప్‌’ ర్యాలీలో రూపానీ అన్నారు. 
 
కాంగ్రెస్‌‌లో చాలా మంది అక్కడి వారికి మద్దతిస్తున్నారు అని చెప్పారు. ఇటీవల బాలాకోట్‌ దాడులపై రాహుల్‌ గాంధీ సలహాదారుడు శామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యల్ని రూపానీ తీవ్రంగా తప్పుబట్టారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ప్రపంచ వ్యాప్తంగా తెలుసు కానీ పాకిస్తాన్‌ని తప్పుబట్టడం పిట్రోడాకు ఎందుకు నచ్చలేదని వ్యాఖ్యానించారు. 
 
కాంగ్రెస్ నాయకులంతా పాకిస్థాన్‌ భాష మాట్లాడుతున్నారని ఆరోపించారు. స్వయంగా సైనికాధికారులు చేసిన ప్రకటనలను ఎందుకు నమ్మడం లేదని ప్రశ్నించారు. రామరాజ్యాన్ని నిర్మించాలనుకుంటున్న మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయన్నారు.