1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 జూన్ 2021 (08:23 IST)

రైల్వే శాఖలో కరోనా మరణమృదంగం - రోజుకు 150 మంది మృత్యువాత

భారతీయ రైల్వే శాఖలో కరోనా వైరస్ మరణమృదంగం కొనసాగిస్తోంది. ఈ వైరస్ బారినపడిన రైల్వే సిబ్బందిలో రోజుకు 150 మంది వరకు మృత్యువాతపడుతున్నారు. ఈ విషయాన్ని రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవో సునీత్ శర్మ తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రైల్వేలోని 12 లక్షల మంది సిబ్బందిలో 7.50 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని వివరించారు. అలాగే, ఈ మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 2,400 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. 
 
కాబట్టి రైల్వే ఉద్యోగులను ప్రాధాన్య జాబితాలో చేర్చి టీకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్టు చెప్పారు. కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు రైల్వే ఆసుపత్రులలో వెంటిలేటర్లు, పడకలు పెంచడంతోపాటు ఆక్సిజన్ ప్లాంట్లను కూడా నెలకొల్పినట్టు తెలిపారు.
 
ముంబై - హైదరాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఇంకా డీపీఆర్ తయారీలోనే ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కరోనా ఆంక్షల వల్ల రైళ్లను పూర్తిస్థాయిలో నడపలేకపోతున్నామని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 889 ప్రత్యేక రైళ్లు, 479 ప్యాసింజర్ రైళ్లను నడుపుతున్నట్టు సునీత్ శర్మ వివరించారు.