1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , గురువారం, 21 అక్టోబరు 2021 (18:57 IST)

కుప్పకూలిన భార‌త వాయుసేన జెట్ ఫైట‌ర్ విమానం

వాయుసేనకు చెందిన మిరాజ్‌ 2000 ఫైటర్‌ జెట్‌ విమానం నేడు కుప్పకూలింది. మధ్యప్రదేశ్‌లోని భింద్‌ జిల్లాలో ఈ ప్ర‌మాద ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం నుంచి పైలట్‌ సురక్షితంగా బయటపడినట్లు వాయుసేన పేర్కొంది. భింద్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలోని మనకాబాద్‌ వద్ద ఖాళీ ప్రదేశంలో విమానం కూలినట్లు తెలుస్తోంది.
 
శిక్షణలో భాగంగా ఈ విమానం ఉదయం సెంట్రల్‌ సెక్టార్‌ నుంచి గాల్లోకి ఎగిరింది. అనంతరం ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఘటనా స్థలిలో విమానం తోక భాగం నేలలో కూరుకుపోయి కనిపిస్తోంది. సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు వాయుసేన భావిస్తోంది. ఈ ప్రమాదానికి కారణాలను అన్వేషించేందుకు వాయుసేన విభాగం దర్యాప్తు ప్రారంభించింది. అస‌లు మిరాజ్‌ 2000 ఫైటర్‌ జెట్‌ విమానం త‌నంత‌ట తాను సాంకేతిక లోపంతో కుప్ప‌కూలిందా? మ‌రేదైనా కార‌ణాలున్నాయా అనే దిశ‌లో విచార‌ణ చేస్తున్నారు.