1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 జులై 2022 (12:26 IST)

టేకాఫ్ అవుతూ బురదలోకి జారుకున్న విమానం...

indigo flight
అస్సాం రాష్ట్రంలోని జొర్హాట్‌ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. కోల్‌కతాకు వెళుతున్న విమానం ఒకటి టేకాఫ్ అవుతున్న సమయంలో రన్ వే పై నుంచి జారిపోయింది. దీంతో పక్కనే ఉన్న బరుదలో జారుకునిపోవడంతో ఓ విమానం చక్రం బురదలో ఇరుక్కునిపోయింది. చక్రం బురదలో ఇరుక్కునిపోయిన ఫోటోను ఒక జర్నలిస్టు ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. 
 
దీంతో ఈ విమాన సర్వీసును ఇండిగో విమానయాన సంస్థ నిలిపివేసింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 98 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.