శనివారం, 2 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 ఆగస్టు 2025 (12:57 IST)

గుమస్తా ఉద్యోగి నెల వేతనం రూ.15 వేలు.. ఆస్తులు రూ.30 కోట్లు

Cash
కర్నాటక రాష్ట్రంలో ఓ ప్రభుత్వ మాజీ ఉద్యోగి బండారం బయటపడింది. నెలకు రూ.15 వేలు వేతనం తీసుకునే ఆ ఉద్యోగి ఆస్తులు మాత్రం రూ.30 కోట్లుగా ఉన్నాయి. ఈ విషయం లోకాయుక్త అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో వెలుగు చూశాయి. ఇంతకీ ఆ ఉద్యోగి చేసేది గుమస్తా ఉద్యోగం. అతనిపై అవినీతి ఆరోపణలు రావడంతో లోకాయుక్త అధికారులు సోదాలు జరిపిపారు. అప్పట్లో ఆయన జీతం నెలకు రూ.15వేలు కాగా.. ఆస్తులు మాత్రం రూ.30 కోట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
 
కర్నాటక రాష్ట్రంలోని కొప్పల్‌ జిల్లాలోని కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్‌‌లో కలకప్ప నిడగుండి అనే వ్యక్తి గుమస్తాగా చేసి రిటైరయ్యారు. నెలకు రూ.15 వేలు జీతానికి పనిచేశారు. అందులోనే మాజీ ఇంజినీర్‌గా ఉన్న జెడ్ఎం.చిన్చోల్కర్‌తో కలిసి నిడగుండి పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 
 
పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నకిలీ పత్రాలు, నకిలీ బిల్లులు సృష్టించడంతో పాటు దాదాపు రూ.72 కోట్లకు పైగా దుర్వినియోగం చేశారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై లోకాయుక్తకు ఫిర్యాదు అందడంతో కోర్టు ఆదేశాలమేరకు నిడగుండి ఇంట్లో అధికారులు సోదాలు చేశారు.