శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 2 మే 2019 (14:33 IST)

అక్రమ సంబంధం.. ఆరేళ్ల కుమారుడు బలి.. భర్తను అలా చూసిన పాపానికి?

అక్రమ సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా తండ్రి లైంగిక సంబంధం కొడు ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాశీపురా ఏరియాలో ఆరేళ్ల చిన్నారి మృతదేహం కనిపించటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల ఎంక్వైరీ‌లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
చనిపోయిన బాలుడు తండ్రికి లెదర్ బ్యాగ్స్ తయారు చేసే ఓ కంపెనీ ఉంది. అక్కడ పని చేసే ఓ పాతికేళ్ల యువకుడితో అతను లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. కొంతకాలంగా అతని ప్రవర్తనలో మార్పు రావడం భార్య గమనించింది. దీంతో భర్తపై భార్య నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలో ఓ రోజు భర్త మరో యువకుడితో ఉండటం తన కళ్లారా చూసి షాకైంది. ఆమెకు కోపం కట్టలు తెచ్చుకుంది. 
 
వెంటనే ఆ యువకుడికి నాలుగు చీవాట్లు పెట్టి.. తమ కంపెనీలో పనికి రావద్దని హెచ్చరించింది. దీన్ని మనసులో పెట్టుకున్న ఆ యువకుడు ఆమె మీద కసి తీర్చుకోవాలనుకున్నాడు. ఆమె మీద కోపంతో ఆరేళ్ల కుమారుడిని అపహరించి హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.