1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2017 (10:30 IST)

లా విద్యార్థినిపై ఫలాహరీ బాబా అత్యాచారం...

దేశంలో దొంగ బాబాల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. ఇప్పటికే ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం జరిపిన కేసులో డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్‌కు 20 యేళ్ల జైలు శిక్షపడిన విషయం తెల్సిందే. ఈనేపథ్యంలో మరో కీ

దేశంలో దొంగ బాబాల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. ఇప్పటికే ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం జరిపిన కేసులో డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్‌కు 20 యేళ్ల జైలు శిక్షపడిన విషయం తెల్సిందే. ఈనేపథ్యంలో మరో కీచక బాబా ‘వ్యవహారం’ వెలుగుచూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఛత్తీస్‌‌ఘడ్‌‌లోని బిలాస్‌‌పూర్‌‌కు చెందిన యువతి లా విద్యాభ్యాసం చేసింది. ఇంటర్న్‌షిప్ కూడా విజయవంతంగా పూర్తిచేసింది. ఈ ఆనందాన్ని తన బంధువైన ఫలాహరీ బాబాతో పంచుకుందామని అదేపట్టణంలో ఉన్న ఫలాహారీ బాబా దగ్గరకు వెళ్లింది. పూజలో ఉన్న బాబాను కలిసేందుకు అతని గదిలోకి వెళ్లింది.
 
హారతి కార్యక్రమం పూర్తి కావడంతో గదిలోకి వచ్చిన బాబా, యువతిని చూసి తలుపుగడియ పెట్టి అత్యాచారయత్నం చేశాడు. దీంతో యువతి అవమానభారంతో ఢిల్లీలోని తన సోదరుడి దగ్గరకు చేరుకుని జరిగింది వివరించింది. దీంతో అతను తన సోదరిని తీసుకుని బిలాస్‌పూర్ చేరుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాబాపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.