1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 మే 2021 (11:30 IST)

సహజీవనం చేయడానికి కోర్టు అంగీకారం కోరడం సరికాదు...

పంజాబ్, హర్యానా హైకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. సహజీవనం చేసేందుకు కోర్టు అనుమతి కోరడం సరికాదంటూ వ్యాఖ్యానించింది. యువతీ, యువకులు సహజీవనం చేయడం సామాజికంగా, నైతికంగా అంగీకారయోగ్యం కాదని పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పును వెలువరించింది. 
 
సహజీవనం చేయడానికి కోర్టు అంగీకారాన్ని కోరడం సరికాదని, సహజీవనం చేస్తున్న వారికి తాము రక్షణ కల్పించలేమని పేర్కొంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ఓ యువజంట పెద్దల నుంచి దూరంగా పారిపోయి సహజీవనం చేస్తోంది. తామిద్దరం కలసి ఉంటున్నామని, త్వరలోనే పెళ్లి చేసుకుంటామని హైకోర్టులో వీరిద్దరూ పిటిషన్ వేశారు. అయితే, వధువు కుటుంబం నుంచి ప్రాణహాని వుందని, అందువల్ల సహజీవనం చేసేందుకు కోర్టు అనుమతివ్వాలంటూ వారు పిటిషన్‌లో కోరారు. 
 
దీన్ని విచారణకు స్వీకరించిన కరో్టు... సహజీవనం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేస్తూ, వారు వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. మరోవైపు సహజీవనాలకు అనుకూలంగా గతంలో సుప్రీంకోర్టు తీర్పులు వెలువరించింది. మేజర్లుగా ఉన్న యువతీయువకులు పెళ్లి చేసుకోకపోయినా, పరస్పర అంగీకారంతో సహజీవనం చేసే హక్కు ఉంటుందని సుప్రీంస్పష్టం చేసింది. సహజీవనం మన దేశంలో ఆమోదయోగ్యం కాకపోయినా, పాపం మాత్రం కాదని చెప్పింది. మేజర్ యువతి తనకు నచ్చిన తోడును ఎంచుకోవచ్చని వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే.