గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 డిశెంబరు 2019 (14:56 IST)

చెరకు తోటలో 17వ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. చివరికి?

కర్ణాటకలో ఓ మహిళ చెరకు తోటలో 17వ బిడ్డకు ప్రసవించింది. కర్ణాటకలో మహిళలు చాలామటుకు చెరుకు పనుల కోసం వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలోని బెల్గాం జిల్లాలోని చెరకు పనులకు… నిండు గర్భిణి వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే ఆమె చెరుకు పొలంలో పనులు చేస్తూ, తన 17 వ బిడ్డకు జన్మనిచ్చింది. 
 
సంచార గోపాల్ వర్గానికి చెందిన ఈ మహిళ సెప్టెంబరులో 20 వ సారి గర్భవతి అని వైద్యులు గుర్తించారు. ఆమెకు 11 మంది పిల్లలు, వారిలో తొమ్మిది మంది బాలికలు ఉన్నారు. ఆమెకు మూడుసార్లు అబార్షన్ కాగా, ఐదుగురు పిల్లలు చనిపోయారని మీడియాకు తెలిపారు. 
 
ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆమెను కలవడానికి కొందరు అధికారులు వెళ్ళారు. అప్పటికే ఆమె అక్కడి నుంచి తమ ప్రాంతానికి వెళ్ళిపోయినట్టు గుర్తించారు. కానీ 17వ బిడ్డకు జన్మనిచ్చిన ఆమె వెంటనే ప్రాణాలు కోల్పోయింది.