1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 అక్టోబరు 2021 (20:15 IST)

అత్యాచారం చేయబోతే ప్రతిఘటన.. అంతే సజీవదహనం..

మహిళలపై అకృత్యాలు చోటుచేసుకుంటూనే వున్నాయి. తాజాగా లైంగిక దాడిని ప్రతిఘటించిన మహిళను సజీవదహనం చేసాడు ఓ కామాంధుడు. ఈ ఘటన కర్ణాటకలో దారుణం జరిగింది.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని యాద్గిర్ జిల్లా, సర్పూర్ తాలూకాకు చెందిన గంగప్ప బసప్ప అనే వ్యక్తి సోమవారం తెల్లవారుజామున ఓ వివాహిత ఇంట్లోకి చొరబడి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆమె ప్రతిఘటించింది. ఇదే సమయంలో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను సదరు మహిళపై పోసి నిప్పటించాడు దుండగుడు. 
 
దీంతో మహిళ కేకలు వేసింది.. ఆమె కేకలు విన్న స్థానికులు ఘటన స్థలికి వచ్చి మంటలు ఆర్పీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె శరీరం 95 శాతం కాలిపోయినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుపై నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.