గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 జులై 2023 (17:19 IST)

జూలై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

parlement
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభం కానుంది. ఈ సమావేశాలు ఆగస్టు 11న ముగుస్తాయని కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జ్యోషీ ట్వీట్ చేసి స్పష్టం చేశారు. 
 
అన్నీ పార్టీలూ ఈ సమావేశాల్లో పాల్గొనాలనీ, దేశంలో అంశాలపై చక్కగా చర్చించాలని విజ్ఞప్తి చేశారు. ఈసారి సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలో జరుగుతాయి. 
 
ఈ సమావేశాల్లో ఉమ్మడి పౌర స్మృతి (యూనిసెఫ్ సివిల్ కోడ్-యూసీసీ) బిల్లును ప్రవేశపెట్టి.. ఆమోదించాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.