ఆదివారం, 9 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 మార్చి 2025 (12:04 IST)

బిర్యానీ తిన్న పాపం.. చికెన్ ముక్క అలా చిక్కుకుంది.. 8 గంటలు సర్జరీ

Biryani
బిర్యానీ తిన్న పాపానికి ఓ మహిళ శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. కుర్లాకు చెందిన 34 ఏళ్ల రూబీ షేక్ అనే మహిళ తన బిర్యానీ నుండి చికెన్‌ ఎముక గొంతులో చిక్కుకోవడంతో 8 గంటల పాటు శస్త్రచికిత్స చేయించుకుంది. ఫిబ్రవరి 3న రూబీ తన కుటుంబంతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. 
 
3.2 సెం.మీ.ల చికెన్ ఎముక ఆమె గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో తీవ్రనొప్పిని ఆమె ఎదుర్కొంది. ఈమెకు ఇఏడేళ్ల కూతురు, ఆరు నెలల కొడుకు ఉన్నారు. రూబీకి ఈ చికెన్ ముక్క గర్భాశయ వెన్నెముక ప్రాంతం దగ్గర C4-C5 వెన్నుపూస డిస్క్‌ల మధ్య చిక్కుకుంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఎక్స్-రేలో చికెన్ ముక్క చిక్కుకున్న విషయాన్ని గమనించిన వైద్యులు ఫిబ్రవరి 8వ తేదీన సర్జరీ ద్వారా దానిని వెలికి తీశారు.
 
ఈ శస్త్రచికిత్స చాలా క్లిష్టమైనది, వైద్య రంగంలో ఇటువంటి కేసులు అసాధారణమని వైద్యులు పేర్కొన్నారు. వైద్య ఖర్చుల కారణంగా రూబీ కుటుంబం గణనీయమైన ఆర్థిక భారాన్ని ఎదుర్కొంది.మొత్తం మీద దాదాపు రూ. 8 లక్షలు. అయితే, ఆసుపత్రి విరాళం ద్వారా దానిని సగానికి తగ్గించింది. 
 
పెద్ద శస్త్రచికిత్స తర్వాత కోలుకునే ప్రక్రియలో భాగంగా రూబీకి ఒక నెల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ 'అసాధారణ కేసు'ను ఒక వైద్య పత్రికలో ప్రచురించాలని ఆయన యోచిస్తున్నారు. ఈ చేదు అనుభవం కారణంగా ఇకపై బిర్యానీ తిననని రూబీ షేక్ పేర్కొంది. ఆమె తన భర్తకు ఇకపై ఎప్పటికీ బిర్యానీ వండనని చెప్పింది.