1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 మే 2022 (22:25 IST)

ప్రియురాళ్లతో భర్త జల్సాలు... భార్యను గొంతుకోసేశాడు..

romance
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. భార్య సహిస్తుందని.. ఇద్దరు ప్రియురాళ్లతో ఒకే బెడ్ రూమ్‌లో జల్సాలకు దిగాడు. అయిన భార్య సహిస్తుందని ఏకంగా ఇంట్లో బెడు రూంలోకే తీసుకొచ్చి నిండు ప్రాణాన్ని తీశాడు. 
 
ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిన అతడిని కన్న తల్లిదండ్రులే పోలీసులకు పట్టించారు. ఈ విషాద ఘటన ఉత్తర‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆగ్రా సమీపంలోని తజ్‌నాగారి ప్రాంతానికి చెందిన ఉమాంగ్ చౌదరి ఉమాంగ్‌ దయాల్‌ బాగ్‌లో కార్ల వాషింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. 
 
అతడికి గత డిసెంబర్ 11న తజ్‌నాగారి చెందిన ప్రీతితో వివాహం అయింది. ప్రస్తుతం ఆమె రెండున్నర నెలల గర్భిణి. ఉమాంగ్ చౌదరికి మద్యం తాగే అలవాటుతోపాటు ప్రియురాళ్లు ఉన్నారు. వాళ్లతో విచ్చలవిడిగా తిరుగుతూ జల్సాలు చేసేవాడు. 
 
అతడి చెడు అలవాట్లను మార్చడానికే తల్లిదండ్రులు వివాహం చేశారు. అయినా అతడితో ఎలాంటి మార్పు రాలేదు. నిత్యం మద్యం తాగుతూ లవర్స్‌తో ఎంజాయ్ చేసేవాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య అతడికి నచ్చచెప్పింది. 
 
అయినా ప్రియురాళ్లను ఇంటికి పిలుపించుకున్నాడు. వాళ్లు నేరుగా బెడ్రూంలోకి వెళ్లి అతడితో సరసాలాడుతూ కూర్చున్నారు. వారి చేష్టలకు ఆగ్రహించిన భార్య ఆ ఇద్దరు యువతులను వెళ్లిపోవాలని గొడవకు దిగింది. 
 
దీంతో ఆగ్రహం చెందిన భర్త ఉమాంగ్ చౌదరి ప్రియురాళ్ల ముందే ప్రీతిపై దాడి చేశాడు. పదునైన కత్తితో ఆమె గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె.. అక్కడికక్కడే మృతిచెందింది. ప్రియురాళ్ల కోసం గర్భంతో ఉన్న భార్యను హత్య చేయడం విషాదంగా మారింది.