శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (11:12 IST)

సీనియర్ ఉద్యోగి కోర్కె తీర్చలేదు.. సెక్యూరిటీ గార్డుతో హత్య చేయించాడు : ఇన్ఫోసిస్‌ టెక్కీ తండ్రి రాజు

సీనియర్ ఉద్యోగి కోర్కె తీర్చక పోవడంతో సెక్యూరిటీ గార్డుతో హత్య చేయించాడని పూణెలో హత్యకు గురైన ఇన్ఫోసిస్ టెక్కీ తండ్రి రాజు ఆరోపించారు. నిజానికి ఆదివారం కార్యాలయం సెలవు అయినప్పటికీ.. నా కుమార్తెను మాత్

సీనియర్ ఉద్యోగి కోర్కె తీర్చక పోవడంతో సెక్యూరిటీ గార్డుతో హత్య చేయించాడని పూణెలో హత్యకు గురైన ఇన్ఫోసిస్ టెక్కీ తండ్రి రాజు ఆరోపించారు. నిజానికి ఆదివారం కార్యాలయం సెలవు అయినప్పటికీ.. నా కుమార్తెను మాత్రం ఒంటరిగా కార్యాలయానికి పిలిపించి, హత్య చేయించారని టెక్కీ తండ్రి మాజీ ఆర్మీ అధికారి రాజు ఆరోపించాడు. పూణెలోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో రశీల రాజు అనే 23 యేళ్ల టెక్కీని సెక్యూరిటీ గార్డు విద్యుత్ వైర్లతో మెడకు ఉరి బిగించి హత్య చేసిన విషయం తెల్సిందే. 
 
దీనిపై మృతురాలి తండ్రి మాట్లాడుతూ తమ కుమార్తె రశీల రాజు (23) పూణేలోని ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తోందని, అయితే... ఆమె కార్యాలయంలోనే పనిచేస్తున్న ఓ సీనియర్ ఉద్యోగి తరచూ వెంటపడి తన కుమార్తెను వేధించేవాడన్నారు. అతనికి లొంగకపోవడంతో తన కుమార్తెను అంతమొందించేందుకు ప్లాన్ చేశాడన్నారు. ఆరోజు ఆదివారం అయినప్పటికీ రశీలకు ఫోన్ చేసి ఆఫీస్‌కు రావాలని చెప్పడంతో కార్యాలయానికి వచ్చిన ఆమెను సెక్యూరిటీ గార్డుతో హత్య చేయించారన్నారు.
 
కాగా... రాజీవ్‌గాంధీ ఇన్ఫోటెక్‌ పార్క్‌లో ఉన్న ఇన్ఫోసిస్‌ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం పనిచేయడానికి వెళ్లిన రశీలను సాయంత్రం 9వ అంతస్తులో సెక్యూరిటీ గార్డు సాయికియా హత్య చేయడం తెలిసిందే. అస్సాం రాష్ట్రానికి చెందిన సెక్యూరిటీ గార్డు సామాన్లు సర్ధుకుని పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలావుండగా, రశీల మృతికి నష్టపరిహారంగా రూ.కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా, ఆమె కుటుంబంలో మరొకరికి ఉద్యోగం ఇవ్వడానికి ఇన్ఫోసిస్‌ సంస్థ ఒప్పుకున్నట్లు అంగీకరించింది.