శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (13:15 IST)

నెల్లూరు వైద్యుడి మృతదేహాన్ని శ్మశానంలో పడేసివెళ్లిన ఆస్పత్రి సిబ్బంది.. ఎక్కడ?

చెన్నై మహానగరంలో ఓ అమానవీయ ఘటన ఒకటి జరిగింది. కరోనా వైరస్ బారినపడి చెన్నైలోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన నెల్లూరుకు చెందిన ఆర్థోపెడిక్ వైద్యుడు చికిత్స ఫలించక కన్నుమూశారు. దీంతో ఆయన మృతదేహానికి ఎలాంటి అంత్యక్రియలు నిర్వహించలేదు. 
 
పైగా, నగర శివారు ప్రాంతంలో ఉన్న అంబత్తూరు శ్మశానవాటికలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అది చివరకు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి దృష్టికి చేరడంతో ఆయన ఆదేశం మేరకు రంగంలోకి దిగిన చెన్నై నగర పాలక సంస్థ పారిశుద్ధ్యం కార్మికులు మృతదేహాన్ని ఆంబులెన్స్‌లో మరో ప్రాంతానికి తరలించారు.
 
కాగా, కరోనా వైరస్ బారినపడి చనిపోతే మృతదేహాలను కుటుంబం సభ్యులకు ఇప్పగించరాదన్న నిబంధన ఉంది. దీంతో నెల్లూరు వైద్యుడి మృతదేహాన్ని కూడా బంధువులకు ఇవ్వలేదు. అయితే, ఆస్పత్రి సిబ్బందే దాన్ని ఖననం చేయాల్సివుంది. కానీవారు అత్యం అమానవీయంగా నడుచుకున్నారు. మృతదేహాన్ని కనీసం శ్మశానవాటికలో పాతిపెట్టకుండా, ఆరుబయటే పడేసి వెళ్లిపోయారు. ఇలాంటి చర్యలపై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.