మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 27 మే 2015 (17:09 IST)

పీఎంవోను ఎన్నడు కూడా స్వార్ధానికి వాడుకోలేదు : మన్మోహన్ సింగ్

ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఎన్నడు కూడా తన స్వార్ధానికి వాడుకోలేదని మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. తన పదేళ్ళ  యూపీఏ ప్రభుత్వ పాలనపై వస్తున్న అవినీతి ఆరోపణలు, విధానపరమైన నిర్ణయాల లోపాలపై ఆయన బుధవారం తొలిసారి స్పందించారు. ముఖ్యంగా తన కుటుంబ సభ్యులను, మిత్రులను ధనవంతులు చేసేందుకు పీఎంవోను దుర్వినియోగం చేయలేదని తేల్చి చెప్పారు.
 
ఢిల్లీలో జరిగిన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా జాతీయ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం దిగిపోయే సమయానికి అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్ రెండోదిగా ఉన్నదని గుర్తు చేశారు. అయితే, ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తమ సర్కారుపై అవినీతి ఆరోపణలు చేస్తూ దేశ ప్రజల దృష్టిని మళ్లిస్తోందని ఆరోపించారు.