గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 జనవరి 2021 (13:56 IST)

వివాహమైన నెల రోజులకే భార్య మెడకు నైలాన్ తాడు బిగించి ఉరేసిన భర్త!

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం జరిగింది. వివాహమైన నెల రోజులకే కట్టుకున్న భర్త కసాయిగా మారిపోయాడు. పడక గదిలో ఏర్పడిన చిన్నపాటి మనస్పర్థల కారణంగా భార్య మెడకు నైలాన్ తాడుతో ఉరి బిగించి చంపేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మ‌హారాష్ట్ర‌లోని పాల్ఘ‌ర్ జిల్లా వ‌సాయ్ ఏరియా తులింజ్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధికి చెందిన 24 యేళ్ళ వ్యక్తి గ‌త డిసెంబ‌ర్ 7న అదే జిల్లాకు చెందిన 28 ఏండ్ల మ‌హిళ‌ను అత‌డు వివాహం చేసుకున్నాడు. 
 
అయితే, పెండ్ల‌యిన కొన్ని రోజుల‌కే ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. ఎప్ప‌టిలాగే ఆదివారం రాత్రి కూడా ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రగ‌డంతో భర్త భార్య మెడ‌కు నైలాన్ తాడుతో ఉరిబిగించి చంపేశాడు. 
 
మృతురాలి సోద‌రుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి త‌ర‌లించి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేప‌ట్టారు.