ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (16:58 IST)

కోర్టు హాలులో కాల్పులు.. మహిళా లాయర్‌కు తీవ్రగాయాలు, ముగ్గురు మృతి

ఢిల్లీ రోహిణి కోర్టు హల్‌లో జరిగిన 'గ్యాంగ్ వార్' లో మొత్తం నలుగురు మరణించారు. 'మోస్ట్ వాంటెడ్' గ్యాంగ్ స్టర్ జితేంద్ర, అలియాస్ గోగి పై టిల్లు గ్యాంగ్ మనుషులు కాల్పులు జరపగా గోగి అక్కడికక్కడే మృతి చెందాడు. గోగి పై దాడికి పాల్పడిన టిల్లు గ్యాంగ్‌కు చెందిన దుండగులపై ఢిల్లీ 'స్పెషల్ సెల్' సాయుధ పోలీసులు కాల్పులు జరపడంతో వారిలో ముగ్గురు మరణించారు. 
 
శుక్రవారం మధ్యాహ్నం 2.34 గంటలకు కోర్టు నెంబర్ 2 హాలులోనే ఈ కాల్పులు జరిగాయి. న్యాయవాదుల వేషధారణలో ఉన్న టిల్లు గ్యాంగ్‌కు చెందిన దుండగులు ఈ కాల్పులకు పాల్పడ్డారు. ఈ రెండు గ్యాంగుల మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న వైరం ఉంది. గ్యాంగ్ స్టర్ గోగితో సహా దాడికి పాల్పడిన ముగ్గురు మృతి చెందగా. మరో ముగ్గురికి గాయాలు కావడంతో హుటాహటిన ఆసుపత్రికి తరలించారు.
 
ఈ కోర్టు కాల్పుల ఘటనలో మహిళా లాయర్‌కు తీవ్ర గాయాలైనట్టు సమాచారం. గ్యాంగ్‌స్టర్ జితేందర్‌ను ఓ కేసు విషయంలో పోలీసులు రోహిణి కోర్టుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో లాయర్ దుస్తుల్లో వచ్చిన కొందరు దుండగులు రూమ్ నెంబర్ 207 వద్ద కాల్పులు జరిపారు. పోలీసులు కూడా దుండగులపై ఎదురు కాల్పులు జరిపారని, పోలీసులు, దుండగులు మధ్య జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ఓ మహిళా లాయర్‌కు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ొొొొొొ