1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (13:11 IST)

ఢిల్లీలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై రాళ్లదాడి

owaisi house
ఢిల్లీలో ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై కొందరు దుండగులు రాళ్ళతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆదివారం సాయంత్రం ఈ దాడి జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
 
జైపూర్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఆయన తన ఇంటిపై రాళ్లదాడి జరిగినట్టు గుర్తించారు. ఆ తర్వాత వీడియో తీసి ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని తన నివాసంపై మరోమారు దాడి జరిగిందని, గత 2014 తర్వాత ఈ తరహా దాడి జరగడం ఇది నాలుగోసారి అని ఆయన పేర్కొన్నారు. 
 
ఈ దాడిలో ఇంటి అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. డీసీపీ సారథ్యంలోని ప్రత్యేక బృందం పోలీసులు దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో కీలకమైన సాక్ష్యాధారాలను సేకరించారు.