1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 మే 2025 (14:30 IST)

భారత్ మాతాకీ జై నినాదాలతో మార్మోగిన ఆదంపూర్ వైమానిక స్థావరం

narendra modi
పంజాబ్ రాష్ట్రంలోని ఆదంపూర్ వైమానికస్థావరం భారత్ మాతాకీ జై నినాదాలతో మార్మోగిపోయింది. దీనికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ పర్యటించడమే. ఆయన మంగళవారం ఈ వైమానిక స్థావరానికి వెళ్లి గంటపాటు అక్కడే గడిపారు. ఈ సందర్భంగా ఆయన వైమానిక దళ అధికారులు, సైనికులతో ముచ్చటించారు. ఇటీవల విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌పై సాయుధ బలగాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రధాని నరేంద్ర మోడీ అక్కడే ఓ గంట పాటు ఉన్నారు 
 
గత ఏప్రిల్ నెల 22వ తేదీన పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది భారత పర్యాటకులను హతమార్చిన విషయం తెల్సిందే. దీనికి ప్రతిగా మే 7వ తేదీన భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్య చేపట్టింది. ఆ తర్వాత మే 9, 10వ తేదీల్లో పాకిస్థాన్‌ దాడికి యత్నించిన వైమానిక స్థావరాల్లో ఆదంపూర్ ఒకటి కావడం గమనార్హం. ఈ పర్యటన ద్వారా సైనికుల ధైర్యసాహసాలను, నిబద్ధతను ప్రధాని కొనియాడారు. భారత్ మాతాకీ జై అంటూ సైనికులతో కలిసి నినాదాలు చేశారు. ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో కలిసివున్న ఫోటోలను ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.