శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2019 (12:56 IST)

కానిస్టేబుల్ కుమార్తెపై కదిలే కారులో గ్యాంగ్ రేప్

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ అత్యాచార ఘటన వివరాలను పరిశీలిస్తే, బబ్లూ, కాశీరాం జేపీ గుప్తా, హరీశ్‌ అనే ముగ్గురు వ్యక్తులు ఉద్యోగం ఇప్పిస్తానని ఓ కానిస్టేబులు కుమార్తెను నమ్మించారు. దీంతో వారికి వారికి ఆ యువతి గతంలో రూ.50 వేలు ఇచ్చింది. డబ్బులు తీసుకొని చాలాకాలమైనా.. ఆ ముగ్గురు ఉద్యోగం ఇప్పించకపోవడంతో.. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేసింది. 
 
డబ్బులు తిరిగి ఇచ్చే విషయంలో తీవ్ర జాప్యం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో విభూతిఖండ్‌ వద్దకు రావాలని, డబ్బులు తిరిగి ఇస్తామని బాధితురాలికి చెప్పారు. దీంతో అక్కడికి వెళ్లిన తనను బలవంతంగా కారులో ఎక్కించుకొని.. నడుస్తున్న కారులో ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత తాలిబగ్‌ ప్రాంతంలో కారు నుంచి కిందికి తోసేసి అక్కడ నుంచి పారిపోయారు. దీనిపై బాధితురాలు స్థానిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.