1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 జూన్ 2025 (16:42 IST)

Priyanka Gandhi గాజాలో అలా జరుగుతుంటే.. మోదీ సర్కారు ఇలా ప్రవర్తిస్తే ఎలా? ప్రియాంక గాంధీ

Priyanka Gandhi
గాజాలో పౌరుల రక్షణ- చట్టపరమైన, మానవతా బాధ్యతలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చే ఐక్యరాజ్యసమితి తీర్మానానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం దూరంగా ఉండటంపై వయనాడ్ నుండి కాంగ్రెస్ ఎంపీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా శనివారం తీవ్రంగా విమర్శించారు.
 
గాజా వివాదంలో ఇరు పక్షాలను దగ్గరకు తీసుకురావడంపై ప్రయత్నాలు దృష్టి పెట్టాలని ఇజ్రాయెల్‌ను విమర్శిస్తూ జనరల్ అసెంబ్లీ తీర్మానానికి భారతదేశం మళ్ళీ దూరంగా ఉంది. గురువారం జరిగిన తీర్మానానికి దూరంగా ఉన్న 19 దేశాలలో భారతదేశం ఒకటి. 149 ఓట్లు, అమెరికాతో సహా 12 వ్యతిరేకంగా ఓటు వేశాయి.
 
 ఈ చర్యను "సిగ్గుచేటు మరియు నిరాశపరిచేది" అని ప్రియాంక ఎక్స్‌లో పోస్ట్ చేశారు 
 
60వేల మంది, ఎక్కువగా మహిళలు, పిల్లలు, ఇప్పటికే చంపబడ్డారు. మొత్తం జనాభా పరిమితం చేయబడి ఆకలితో చనిపోతున్నారు, ఈ నేపథ్యంలో భారతదేశం గైర్హాజరు కావడాన్ని ఆమె విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దేశం దీర్ఘకాల నైతిక దిక్సూచిని విడిచిపెట్టిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు.
 
ఒక దేశాన్ని మొత్తంగా నాశనం చేస్తుంటే మనం మౌనంగా నిలబడటమే కాకుండా, ఇరాన్‌పై దాడి చేసి, దాని సార్వభౌమత్వాన్ని, అన్ని అంతర్జాతీయ నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘిస్తూ సైలెంట్‌గా వుండటం ఏంటని ప్రశ్నించారు. 
 
న్యాయం, అహింస మరియు రాజ్యాంగ సూత్రాల విలువలపై స్థాపించబడిన భారతదేశం, అటువంటి క్షణంలో ఎలా ఉదాసీనంగా ఉండగలదని ప్రియాంక ప్రశ్నించారు.