శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 మార్చి 2023 (16:16 IST)

ఆందోళనకు దిగిన పుల్వామా అమరుల భార్యలు అరెస్టు!

Pulwama
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 40 మంది జవాన్ల కుటుంబాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో యావత్ దేశం ఉలికిపాటుకు గురైంది. అయితే, ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని పలు ప్రభుత్వాన్ని ఢంకా బజాయిస్తూ ప్రకటనలు గుప్పించాయి. ఈ దాడి ఘటన జరిగి మూడేళ్లు గడిచిపోయింది. 
 
ఈ క్రమంలో తమకు న్యాయం జరగలేదని రాజస్థాన్‌లో అమరుల భార్యలు ఆరోపిస్తూ రోడ్డెక్కారు. పుల్వామా బాంబు పేలుడులో రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. వీరిని ఆదుకుంటామని రాజస్థాన్ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. కానీ, ఆ తర్వాత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ క్రమంలో గత నెల 28వ తేదీ నుంచి తమకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. 
 
ఈ విషయం తెలుసుకున్న సచిన్ పైలెట్ అమరవీరుల భార్యలతో స్వయంగా మాట్లాడి, ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ వారు ఏమాత్రం వినిపించుకోలేదు. దీంతో పోలీసులు వారిపట్ల దురుసుగా ప్రవర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. పోలీసుల తీరుపై మండిపడింది. వితంతువులపై భౌతిక దాడి జరిగిందని, దీనిపై వివరణ ఇవ్వాలంటూ రాజస్థాన్ డీజీపీకి లేఖ రాసింది.