గిన్నిస్ బుక్ రికార్డు కోసం అశ్విన్.. 75 గంటల ప్రసంగం యువతే టార్గెట్!
45 ఏళ్ల అశ్విన్ సుడాని గిన్నిస్ బుక్లో రికార్డు సాధించేందుకు రెడీ అయ్యారు. సూరత్కు చెందిన ఈ వ్యక్తి 75 గంటల పాటు ఏకధాటిగా మాట్లాడి గిన్నిస్ బుక్ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు.
45 ఏళ్ల అశ్విన్ సుడాని గిన్నిస్ బుక్లో రికార్డు సాధించేందుకు రెడీ అయ్యారు. సూరత్కు చెందిన ఈ వ్యక్తి 75 గంటల పాటు ఏకధాటిగా మాట్లాడి గిన్నిస్ బుక్ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. గురువారం నుంచి ఆయన రికార్డు ప్రయత్నం మొదలవుతుంది. 75 గంటల్లో 75 వేరువేరు సబ్జెక్టులపై ఆయన మాట్లాడతారు.
ప్రస్తుత కాలంలో యువతీ యువకులకు ఓపిక చాలా తక్కువ ఉందని, దాని వల్ల చాలా సమస్యలు వారు ఎదుర్కొంటున్నారని.. అందుకే వారిని లక్ష్యంగా చేసుకుని.. అశ్విన్ ప్రసంగం ఉంటుంది. ఈ ప్రసంగంలో యువతకు ప్రేరణనిచ్చే అంశాలు, విమెన్ ఎంపవర్మెంట్, కుటుంబ బాధ్యతలు వంటివి చోటుచేసుకుంటాయి. 75 గంటల పాటూ యువతనే దృష్టిలో పెట్టుకుని ఆయన ప్రసంగం చేస్తారు.