1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 అక్టోబరు 2021 (15:51 IST)

రెండో పెళ్లి కోసం 9 నెలల బాబును అమ్మేసింది..

ఓ మహిళ అమ్మ తనానికే మచ్చ తెచ్చింది. మొదటి భర్తతో విడిపోయిన ఆ మహిళ రెండో పెళ్లి చేసుకునేందుకు అడ్డుగా ఉన్న 9 నెలల కన్నబిడ్డను డబ్బుకు అమ్మేసింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని విరుద్‌నగర్ జిల్లాలో జరిగింది. 
 
ఈ జిల్లాకు చెందిన మణికంఠన్ (38) అనే వ్యక్తికి, జెబమలర్ (28) అనే మహిళతో 2019లో వివాహం జరిగింది. వారికి కొద్ద రోజుల తర్వాత కొడుగు పుట్టాడు. పెళ్లైన ఏడాది వరకు బాగానే ఉన్నారు. కానీ ఆ తర్వాత వారి మధ్య చిన్న చిన్న గొడవలు తలెత్తాయి. ఇంతలో జెబమలర్ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. 
 
అయినప్పటికీ భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తీరిపోలేదు. దీంతో కలిసి ఉండడం ఇష్టం లేక విడాకులు తీసుకుని ఎవరికి వారు వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో జెబమలర్ బాబును తీసుకున్ని పుట్టింటికి వెళ్లింది. ఆమెకు రెండో పెళ్లి చేయాలనుకున్నారు. ఎన్ని సంబంధాలు చూసిన బిడ్డ ఉన్నాడనే కారణంతో ఎవరూ ముందుకు రాలేదు. తన రెండో పెళ్లికి కుమారుడే అడ్డుగా ఉన్నాడని జెబమలర్ ఓ ప్లాన్ చేసింది. ఎలాగైనా కుమారుడిని అమ్మేయాలని నిర్ణయించుకుంది.
 
తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి బ్రోకర్లను సంప్రదించింది. తమ వద్ద బాబు ఉన్నాడని పిల్లలు లేని వారికి తన కుమారుడిని అమ్ముతానని చెప్పింది. బ్రోకర్ల సాయంతో సెల్వమణి, శ్రీదేవి అనే దంపతులకు రూ.3 లక్షలకు 9 నెలల బాబును అమ్మేసింది. కుమారుడిని అమ్మేసిన విషయం తండ్రి మణికంఠన్‌కు తెలిసింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జెబమలర్‌తో పాటు..  బ్రోకర్లపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.