1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (13:26 IST)

నేరాల అడ్డాగా మారిన యూపీ.. నిస్సిగ్గుగా ఫోనులో వీడియో తీసి..?

ఉత్తరప్రదేశ్‌లో మహిళలు, బాలికలపై లైంగిక దాడి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. మహోబ జిల్లాలో నలుగురు పాలిటెక్నిక్‌ విద్యార్ధులు యువతి (20)పై సామూహిక లైంగిక దాడికి తెగబడిన ఉదంతం వెలుగుచూసింది. 
 
నిందితులు నిస్సిగ్గుగా తమ అకృత్యాన్ని మొబైల్‌ ఫోన్‌లో వీడియో తీశారు. 19 నుంచి 21 సంవత్సరాలలోపు వయసున్న నలుగురు నిందితులను గౌరవ్‌, వికాస్‌, పుష్పరాజ్‌, సౌరభ్‌గా పోలీసులు గుర్తించారు. మార్చి 21 అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
 
బాధిత యువతిని నిందితులు బలవంతంగా తమ రూమ్‌కు తీసుకువచ్చి దారుణానికి ఒడిగట్టారు. నిందితులు మంగళవారం రాత్రి తమ ఇంట్లోకి చొరబడినప్పుడు తాను ఒంటరిగా ఉన్నానని యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు యువతిని వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించారు. లైంగిక దాడి విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వీడియోను వైరల్‌ చేస్తామని నిందితులు యువతిని హెచ్చరించారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని వెల్లడించారు.