1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2016 (11:11 IST)

మానవత్వం మంటగలిసిపోతోంది.. మేనకోడలుపై అత్యాచారయత్నం...

మానవత్వం మంటగలిసిపోతోంది. మానవీయ విలువలు కాస్త గంగలో కలిసిపోతున్నాయి. తాజాగా మేనకోడలిపై మేనమామ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. నేపాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నేపాల్‌ దేశానికి చెంద

మానవత్వం మంటగలిసిపోతోంది. మానవీయ విలువలు కాస్త గంగలో కలిసిపోతున్నాయి. తాజాగా మేనకోడలిపై మేనమామ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. నేపాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నేపాల్‌ దేశానికి చెందిన తులసీ బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. పదేళ్లుగా సైదాబాద్‌ సింగరేణి గుడిసెలలో నివసించేవాడు. 
 
కొద్దినెలల క్రితం కుటుంబంతో చర్లపల్లికి మకాం మార్చాడు. సింగరేణి గుడిసెలలో నివసిస్తున్న సమయంలో వరుసకు అక్క, బావ అయ్యే బంధువుల కుటుంబం అతడి ఇంటి సమీపంలో ఉండేవారు. ఈనెల 17వ తేదీన తులసీ వారింటికెళ్లాడు. బయట ఆడుకుంటున్న వారి కుమార్తె(11)ను ట్యాంక్‌బండ్‌ చూపిస్తానని ఆటో ఎక్కించుకున్నాడు. చర్లపల్లిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. 
 
అనంతరం బాలికను ఇంటివద్ద దింపేశాడు. అయితే బాలిక తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో సైదాబాద్ పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, నిందితుడు పరారీలో ఉన్నాడు.