1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 మార్చి 2021 (10:08 IST)

వీడు తండ్రినా.. లేకుంటే రాక్షసుడా.. కుమార్తె తల నరికి చేత్తో పట్టుకుని..?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోరం జరిగింది. తన 17 సంవత్సరాల కుమార్తె తల నరికిన ఓ తండ్రి, ఆ తలను చేత్తో పట్టుకుని నడి వీధుల్లో వీరంగం వేశాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.... పండితారా గ్రామానికి చెందిన సర్వేశ్ కుమార్ అనే వ్యక్తి, నరికేసిన తన కుమార్తె తల చేత్తో పట్టుకుని నడుస్తుండగా గ్రామస్థులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
విషయం తెలుసుకున్న ఇద్దరు పోలీసు అధికారులు సర్వేశ్ నడుస్తున్న మార్గాన్ని అడ్డగించి ఆ తల ఎవరిదని ప్రశ్నించగా, ఏ మాత్రం సంకోచం లేకుండా, అది తన కుమార్తెదని, తాను ఎలాంటి తప్పూ చేయలేదని, హత్య చేసింది మాత్రం తానేనని చెప్పాడు. 
 
ఆమె మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని, అందుకే భరించలేక హత్య చేశానని అన్నాడు. ఆపై పోలీసులు నరికిన తల కిందపెట్టి, కూర్చోవాలని సూచించగా, చెప్పినట్టుగానే చేశాడు. మిగతా శరీరభాగం ఇంట్లోనే ఉందని చెప్పాడు. ఆపై అతన్ని అరెస్ట్ చేసి, స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు, కేసును విచారిస్తున్నామని అన్నారు.