Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ రోజు ఏ దీపం వెలిగించాలి..? శుక్రవారం పూట 60 దీపాలను..?

Written By సెల్వి
Updated: సోమవారం, 6 ఏప్రియల్ 2020 (19:20 IST)
ఏ రోజు ఏ దీపం వెలిగించాలో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. వారంలో తొలి రోజైన ఆదివారం పూట అయ్యప్ప స్వామికి దీపం వెలిగించడం శ్రేష్ఠం. ఈ దీపాలను తామర పువ్వులాంటి ఆకారంలో వెలిగించడం మంచిది. ఆదివారం వెలిగించే దీపానికి కొబ్బరి నూనెను వాడటం మంచిది. ఇలా చేయడం ద్వారా ఆదాయం చేకూరుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతుంది. 
 
సోమవారం: అనాస పండు ఆకారంలో సోమవారం దీపాలను వెలిగించడం మంచిది. బియ్యం పిండితో ముగ్గులేసి.. దానిపై దీపాలను వెలిగించడం ద్వారా సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఈ దీపానికి బటర్ ఆయిల్ అని కూడా పిలువబడే మహువా నూనె ఆయిల్‌ను వాడితే శుభఫలితాలు చేకూరుతాయి. 
  
మంగళవారం పూట కూడా బియ్యం పిండితో రంగవల్లికలు వేసి.. అందులో దీపం వెలిగించాలి. 21 దీపాలను రెండు చిలుకల ఆకారంలో వుంచి దీపం వెలిగించడం మంచిది. నెయ్యి దీపాన్ని మంగళవారం వెలిగించడం ద్వారా దంపతుల మధ్య అన్యోన్యత పెంపొందుతుంది. అలాగే బుధవారం 23 దీపాలను శంఖువు ముగ్గుపై వెలిగించడం చేయాలి. ఇందుకు నువ్వుల నూనెను వాడటం మంచిది. ఇలా చేయడం ద్వారా పిల్లల్లో బుద్ధి వికాసం పెంపొందుతుంది.  
 
గురువారం.. కొబ్బరి నూనెతో సుదర్శన చక్రం ముగ్గుపై దీపం వెలిగించాలి. దీనివలన శత్రు భయం వుండదు. బంధువుల మధ్య ఐక్యత పెరుగుతుంది. శుక్రవారం పూట 60 దీపాలను వెలిగించడం విశేషం. 
 
వెన్నతో నెయ్యిని కాచి ఆ నెయ్యితో దీపం వెలిగించడం ద్వారా.. ఖర్చులు తగ్గుతాయి. విపరీతమైన ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. శనివారం నువ్వుల నూనెతో 80 దీపాలను వెలిగించడం ద్వారా శనిదోష బాధలుండవు. ఈ దీపం పితృదోషాలను తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments