Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నదోషమంటే ఏంటి..? ''శ్రీకృష్ణార్పణం'' అంటూ మూడుసార్లు?

పితృ దోషాలు, సర్పదోషాల తరహాలోనే అన్నదోషం అనేది వుంది. ఆకలి అని వచ్చిన వారికి అన్నం పెట్టకుండా.. వారిని గెంటేసి.. భుజించిన వారికి అన్నదోషం ఏర్పడుతుంది. ముఖ్యంగా గర్భిణీ మహిళలు ఆకలిగా వున్నప్పుడు వారికి

Written By selvi
Updated: మంగళవారం, 12 జూన్ 2018 (13:07 IST)
పితృ దోషాలు, సర్పదోషాల తరహాలోనే అన్నదోషం అనేది వుంది. ఆకలి అని వచ్చిన వారికి అన్నం పెట్టకుండా.. వారిని గెంటేసి.. భుజించిన వారికి అన్నదోషం ఏర్పడుతుంది. ముఖ్యంగా గర్భిణీ మహిళలు ఆకలిగా వున్నప్పుడు వారికి పక్కనబెట్టుకుని తమ కడుపు నింపుకునేవారికి ఈ దోషం తప్పక అంటుతుంది. ఇంకా భోజనం చేసేందుకు కూర్చున్న వ్యక్తులను లేచిపోయేలా చేసినవారికి అన్నదోషం తప్పదు. 
 
ఇంట్లో ఆహారం వున్నప్పటికీ.. ఇతరులకు కాసింతైనా పంచకుండా భుజించే వారికి, ఆహారాన్ని చెత్తకుండీలో పారవేసేవారికి అన్నదోషం ఏర్పడుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. పితృదేవతలకు పిండ ప్రదానం చేయనివారికి, చిన్నారులకు అన్నం పెట్టకుండా ఆహారం తీసుకునేవారికి అన్నదోషం ఏర్పడుతుంది.
 
ఈ దోషమున్నవారికి ఎంత సంపాదించినా.. సంపద చేతిలో నిలువదు. అలాంటివారు శుక్రవారం ఒంటి పూట భోజనం చేసి అన్నపూర్ణమ్మను కొలవాలి. అలాగే శక్తి తగినట్లు అన్నదానం చేయడం ద్వారా ఈ దోషం తొలగిపోతుంది. అంతేగాకుండా సిరిసంపదలు వెల్లివిరుస్తాయి.
 
అలాగే ఆహారం తీసుకునేటప్పుడు కాళ్లు చేతులు శుభ్రం చేసుకోవాలి. ఒక చేతిని నేలకు ఆనించి ఆహారం తీసుకోకూడదు. ఎడమచేతిలో ఆహారం వడ్డించకూడదు. ''శ్రీకృష్ణార్పణం'' అంటూ మూడుసార్లు ఉచ్ఛరించి ఆహారం తీసుకోవాలి. తూర్పు దిశగా కూర్చుని ఆహారం తీసుకుంటే.. ఆయుష్షు పెరుగుతుంది. ఉత్తర, దక్షిణ దిశల్లో కూర్చుని ఆహారం తీసుకోవడం అంత మంచిది కాదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

TG Assembly: బీఆర్ఎస్ పాలనలో ఎన్టీఆర్‌కు భూమి కేటాయింపులు జరిగాయ్

ప్రధాని మోడీ 76వ పుట్టినరోజు - 76 వంటకాలతో వినూత్నంగా శుభాకాంక్షలు

మరో యువతితో కనిపించిన ప్రియుడు.. నిలదీసినందుకు ప్రియురాలిని కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లాడు (వీడియో)

వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండనే ఉండదు : కేటీఆర్

సెప్టెంబర్ 17, 2026 నాటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాతావరణం ఎలా వుంది..?

అన్నీ చూడండి

16-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభం

తర్వాతి కథనం
Show comments