1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
  4. Pradosham and Narasimha Avatar of Vishnu

Pradosham: ప్రదోష సమయలో నరసింహ స్వామిని పూజించాలి.. ఎందుకంటే?

Narasimha Avatar
Narasimha Avatar
ప్రదోష సమయలో మహేశ్వరునితో పాటు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని పూజించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ప్రదోషకాలంలో శివునికి మాత్రమే అభిషేకం కాదు.. మహా విష్ణువు దశావతారాల్లో ఒకటైన నరసింహ స్వామిని పూజించడం.. ఆయనకు జరిగే అభిషేకాదులలో పాల్గొనడం ద్వారా అప్పుల బాధలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. 
 
లక్ష్మీ నరసింహ స్వామిని, సత్యనారాయణ స్వామిని ప్రదోష వేళలో పూజించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. లక్ష్మీ నరసింహ స్వామికి తిరుమంజన సేవలు చేయించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ప్రదోషం సమయంలో నరసింహ స్వామిని ఆరాధించడం వల్ల ప్రత్యేకంగా రుణబాధలు, మానసిక ఆందోళనలు తొలగిపోతాయి. 
 
ప్రదోషం అనేది సంధ్యా సమయం. ఇది సాధారణంగా శివుడితో ముడిపడి ఉంటుంది. విష్ణు భక్తులకు ప్రదోషం కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే నరసింహ అవతారం ఈ సమయంలో జరిగింది. వైశాఖ శుక్ల చతుర్దశి నాడు ప్రదోష సమయంలో హిరణ్యకశిపుడు ప్రసరింపజేసిన అధర్మాన్ని లోకం నుండి తొలగించడానికి నరసింహుడు కనిపించాడు.
 
 
కఠోర తపస్సు ఫలితంగా రాక్షసుడు హిరణ్యకశిపుడు బ్రహ్మ నుండి ఒక వరం పొందాడు. అతను మనిషి లేదా జంతువు చేత చంపబడడు. ఇంటి లోపల లేదా బయట లేదా పగలు లేదా రాత్రి చంపబడడు. ఆ రాక్షసుడు తెలివిగా అలాంటి వరం కోరాడు. అలా తనకు మరణం వుండదని నమ్మాడు. 
 
కానీ పుట్టుక అంటూ వుంటూ చావనేది తప్పదు. ప్రహ్లాదుడి భక్తి ఫలితంగా నరసింహుడు అవతరించాడు. సింహం ముఖంతో మానవ దేహంతో హిరణ్యకశిపుడిని వధించాడు. తనను పగలు లేదా రాత్రి చంపవద్దని హిరణ్య కశిపుడు కోరాడు. పగలు లేదా రాత్రి లేని సమయంలో నరసింహుడు ప్రదోషంలో వధించాడు. విష్ణు భక్తులు ఆ సమయంలో మౌన వ్రతం చేస్తారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
80 ఏళ్ల వయస్సైతేనేం.. తిరుమల కొండ మెట్లెక్కి.. శ్రీవారిని దర్శించుకున్న వృద్ధురాలు (video)