Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేవెళ్ల శ్రీ వేంకటేశ్వరస్వామి అనుగ్రహం...

శ్రీనివాసుడు తన భక్తులను అనుగ్రహించడం కోసం అనేక ప్రాంతాలలో ఆవిర్భవించారు. ఒక్కో ప్రదేశంలో ఒక్కో లీలను ఆవిష్కరిస్తూ, భక్తుల కోరికలు నెరవేరుస్తుంటారు. అలా అశేష భక్త జనులను ఆకర్షిస్తోన్న క్షేత్రంగా రంగార

Written By Kowsalya
Updated: గురువారం, 2 ఆగస్టు 2018 (13:38 IST)
శ్రీనివాసుడు తన భక్తులను అనుగ్రహించడం కోసం అనేక ప్రాంతాలలో ఆవిర్భవించారు. ఒక్కో ప్రదేశంలో ఒక్కో లీలను ఆవిష్కరిస్తూ, భక్తుల కోరికలు నెరవేరుస్తుంటారు. అలా అశేష భక్త జనులను ఆకర్షిస్తోన్న క్షేత్రంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దర్శనమిస్తుంది. ఇక్కడి గుట్టపై గల శ్రీనివాసుడిని దర్శించుకుంటే ఆయన మహిమలు అందరికీ తెలుస్తాయి.
 
క్రీ.శ.13 వ శతాబ్దంలో ఒక భక్తుడు వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాడు. ఆ తరువాత చాలాకాలంపాటు స్వామివారికి నిత్య ధూప, దీప, నైవేద్యాలు జరుగతూ వచ్చాయి. ఈ క్రమంలో ఆలయం శిధిలావస్థకు చేరుకోగా మరో భక్తుడు ఆలయాన్ని నిర్మించాడు. ఈ నేపథ్యంలోనే ఒక అద్భుతం జరిగింది. ఓ రైతు పొలాన్ని దున్నుతూ బరువు కోసం ఆ పొలం గట్టున ఉన్న రాయిని నాగలిపై ఉంచాడు.
 
పొద్దు పోయేవరకూ పొలాన్ని కొంతవరకు దున్ని ఆ నాగలిని, రాయిని అలాగే వదలి ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం తిరిగి పొలం దగ్గరకి వచ్చిన ఆ వ్యక్తికి ఆ బండరాయి నాగలి దగ్గర కాకుండా పొలం గట్టుపై యథాస్థానంలో కనిపించింది. ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తూనే ఆ రాయిని తెచ్చి మళ్ళీ నాగలిపై పెట్టాడు.
 
కానీ ఆ రాయి వెంటనే దానంతట అదే జరుగుతూ వెళ్లి పొలం గట్టుపై యథాస్థానంలో నిలిచింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అది దైవ మహిమగా భావించి అక్కడికి తరలి వచ్చి పెద్ద సంఖ్యలో కొబ్బరికాయలు కొట్టారు. కానీ ఆ శిలను ఏ దైవంగా భావించాలనే విషయం వాళ్లకు అర్థం కావట్లేదు. ఆ శిల తన సాలగ్రామ రూపమని, తనని ఆ పొలం గట్టుపై నుండి తీసుకువెళ్లి ఆ ఊళ్లోని ఆలయంలో ప్రతిష్టించమని ఆ రాత్రి శ్రీనివాసుడు పూజారి కలలో చెప్పారు. 
 
మరునాడు ఉదయం తనకి వచ్చిన కలను గురించి ఆయన గ్రామస్తులకు తెలియజేశాడు. ఇక గ్రామ ప్రజలందరు కలిసి ఆ శిలా రూపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామిని ఆలయంలో ప్రతిష్టించారు. ఈ సంఘటన కారణంగా ఈ క్షేత్రం మహిమాన్వితమైన క్షేత్రంగా ప్రసిద్ధిచెందింది. 
About Author
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... Read More

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments