తిరుమలలో పోటెత్తిన భక్తులు, రోడ్లపైకి వచ్చిన భక్తుల క్యూలైన్లు

సోమవారం, 23 మే 2016 (11:31 IST)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెలవు దినాలు కావడంతో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గత రెండు రోజులుగా ఉన్న రద్దీని పోలిస్తే సోమవారానికి మరింత పెరిగింది. కంపార్టుమెంట్లన్నీ భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనం వద్ద తితిదే ఏర్పాటు చేసిన క్యూలైన్లు కూడా భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. గంటలకు గంటలు రోడ్లపైనే దర్శనం కోసం భక్తులు పడిగాపులు కాస్తున్నారు.
 
సోమవారం ఉదయం 5 గంటల నుంచి కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి రెండు కిలోమీటర్లకు క్యూలైన్లు బయటకు వచ్చేశాయి. కాలినడక భక్తుల పరిస్థితి అదే. అలిపిరి పాదాలమండపం, శ్రీవారి మెట్ల గుండా వందలాదిమంది భక్తులు గోవిందనామస్మరణలు చేసుకుంటూ తిరుమలకు చేరుకుంటున్నారు. సర్వదర్శనం భక్తులకు 12 గంటల్లోను, కాలినడక భక్తులకు 9 గంటల్లో దర్శనం చేయిస్తామని తితిదే చెబుతోంది. గదులు ఖాళీ లేవు. 
 
ఎక్కడ చూసినా రద్దీ రద్దీ. తలనీలాల వద్ద భక్తులే భక్తులు. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉంటున్నారు.  విఐపిల తాకిడి కూడా అదే స్థాయిలో ఉన్నాయి. తితిదే మాత్రం ఎప్పటిలాగే చేతులెత్తేసింది. గదులు లేక భక్తులు రోడ్లపైనే పడిగాపులు. అర్థరాత్రి నుంచి భక్తులు రోడ్లపైనే సేదతీరుతున్నారు. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించాలని తితిదే ప్రయత్నం చేస్తోంది.

అన్నీ చూడండి

పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కమ్ములాటలు

అధికార బంగ్లాను ఖాళీ చేసే ప్రసక్తే లేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి... రబ్రీదేవి

వెస్ట్ బెంగాల్ : నిన్న అభిషేక్ బెనర్జీ నేడు కళ్యాణ్ బెనర్జీపై దాడి...

గుజరాత్‌లో దారుణం : ఇద్దరు మైనర్ బాలికలు గర్భం - చోద్యం చూసిన తల్లి

భర్త కిరాతక చర్య : భార్యను గంటలపాటు కోడిపుంజు భంగిమలో నిలబెట్టి చిత్రహింసలు

అన్నీ చూడండి

31-05-2026 ఆదివారం ఫలితాలు - ఖర్చులు విపరీతం.. చేతిలో ధనం నిలవదు...

31-05-2026 నుంచి 06-06-2026 వరకు మీ వార రాశిఫలితాలు

30-05-2026 శనివారం ఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి.. ఓర్పుతో పనిచేయండి...

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

తర్వాతి కథనం
Show comments