శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 2 ఆగస్టు 2019 (19:57 IST)

తిరుమల శ్రీనివాసుడు ఆ రికార్డ్ సాధించాడు.. ఏంటది?

ఆపద మ్రొక్కులవాడికి నిలువు దోపిడీనే అంటుంటారు పెద్దవారు. అంటే స్వామివారిని వేడుకొన్న తరువాత మ్రొక్కులు తీర్చుకునే భక్తులు కావాల్సినంత డబ్బులు హుండీలో సమర్పిస్తారన్నది అర్థం. స్వామివారి హుండీ ఆదాయం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. స్వామివారి ప్రాముఖ్యత అలాంటిది.
 
ఈ యేడాది హుండీ ఆదాయం బాగా పెరిగింది. గతంతో పోలిస్తే హుండీ ఆదాయం రెట్టింపు అయ్యింది. అంతేకాదు రికార్డ్‌ను సృష్టించింది. ఈ యేడాదిలో ఇప్పటికే మూడుసార్లు వందకోట్ల రూపాయల ఆదాయం దాటినట్లు టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. 
 
శ్రీవారికి హుండీ ద్వారా భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఈ యేడాది మార్చిలో 105 కోట్ల రూపాయల ఆదాయం, జూన్ నెలలో వంద కోట్ల రూపాయలు, జూలైలో 106.28 కోట్ల రూపాలయ హుండీ ఆదాయం వచ్చినట్లు టిటిడి అధికారులు చెబుతున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రికార్డ్‌గా కూడా టిటిడి ఈఓ తెలిపారు.