సప్తగిరులపై బ్రహ్మోత్సవం శోభ - బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ జరిగింది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని విష్వక్సేనుడి వైభవంగా మాఢా వీధుల్లో ఊరేగించారు. వందలాదిమంది భక్తుల గోవిందనామస్మరణల మధ్య వైభవోపేతంగగా విష్వక

సోమవారం, 3 అక్టోబరు 2016 (12:57 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ జరిగింది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని విష్వక్సేనుడి వైభవంగా మాఢా వీధుల్లో ఊరేగించారు. వందలాదిమంది భక్తుల గోవిందనామస్మరణల మధ్య వైభవోపేతంగగా విష్వక్సేనుడి విహరించారు. సప్తగిరులు మొత్తం బ్రహ్మోత్సవం శోభను సంతరించుకుంది. భక్తుల మనసుల్లో ఆధ్మాత్మిక భావనలు వెల్లివిరుస్తున్నాయి. మంగళవారం రాష్ట్రప్రభుత్వం తరపున శ్రీవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. 
 
కాగా, ఈ బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వచ్చే వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించారు. దక్షిణ మాడ వీధిలో ప్రత్యేక గేటు ద్వారా వీరిని దర్శనానికి అనుమతిస్తారు. మిగిలిన భక్తుల మాదిరిగా వీరు చుట్టూ తిరిగి రావాల్సిన పని లేకుండా గంటలోనే స్వామి దర్శనం చేసుకునేందుకు వీలుంది. ఉదయం 10 గంటలకు ఓసారి, మధ్యాహ్నం 3 గంటలకు ఓ సారి భక్తులను ఇక్కడ అనుమతిస్తారు. దానికి రెండు గంటల ముందుగానే వైకల్య సర్టిఫికెట్, వృద్ధాప్యాన్ని నిర్ధారించే పుట్టిన తేదీ ధ్రువీకరణలతో భక్తులు చేరుకోవాల్సి ఉంటుంది. 

అన్నీ చూడండి

తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్

ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ముజిగల్ అకాడమీ కూకట్‌పల్లి 700 మంది విద్యార్థుల నమోదు

లక్నోలోని కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం.. 14మంది విద్యార్థులు మృతి (video)

తెలంగాణ పట్ల వైరం లేదు.. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించడమే లక్ష్యం.. బాబు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జూన్ 26 వరకు భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

సత్వ గుణం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందేమిటి?

21-06-2026 నుంచి 27-06-2026 వరకు వార ఫలితాలు - మీ మాటకు తిరుగుండదు

తర్వాతి కథనం
Show comments