శ్రీవారి భక్తులు అలా హెచ్చరించిన టిటిడి ఇఓ

శనివారం, 7 ఆగస్టు 2021 (23:06 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి, స్పెసిఫైడ్ అథారిటీ కమిటీ చైర్మన్ డాక్టర్ జవహర్ రెడ్డి  శ్రీవారి భక్తులకు హెచ్చరించారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాలన్నారు. ఎవరో నిర్లక్ష్యంగా ఉండవద్దని మాస్క్‌లను తప్పనిసరిగా ధరించాలని.. సామాజిక దూరాన్ని పాటించి తీరాలని సూచించారు.
 
కేసుల సంఖ్య పూర్తిగా తగ్గిపోతుందని చాలామంది తిరుమలలో మాస్కులు ఉన్నా వేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నారని.. అలాగే గుంపులుగుంపులుగా కనిపిస్తున్నారని.. టీటీడీ సిబ్బంది ఎన్నిసార్లు భక్తులకు చెబుతున్న వినిపించుకోవడం లేదన్నారు ఇఓ. కరోనా కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతోందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు.
 
డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పాల్గొన్న జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇప్పట్లో ఆన్‌లైన్‌లో టోకెన్లను పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రతిరోజు ఇచ్చే టోకెన్లను 5 వేల నుంచి 8 వేలు చేశామన్నారు. అంతకుమించి టోకెన్లను పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
 
టోకెన్లను పెంచాలన్న ఆలోచన కూడా తమకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు టోకెన్లను పెంచేస్తారన్న ఆలోచన అస్సలు లేదన్నారు. కరోనా తీవ్రత బాగా తగ్గిందని అనిపిస్తే అప్పుడు ఆలోచన, నిర్ణయాలు ఉంటాయన్నారు.

అన్నీ చూడండి

పెళ్లిలో ఏంటి ఈ వెకిలి డ్యాన్సులు? వధువును మందలించిన వరుడు, పెళ్లి కేన్సిల్ చేసిన పిల్ల తండ్రి

జనసేనాని పవన్‌కు కాంగ్రెస్ ఆఫర్.. ఓకే అంటే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తాం..?

కోడలికి మళ్లీ పెళ్ళి చేసిన మామ.. ఎక్కడ?

ట్రంప్‌ను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర చేస్తోందంటూ ఇజ్రాయెల్ రహస్య నివేదిక

ఏపీలో కరోనా కలకలం: కోవిడ్ లక్షణాలతో ఇద్దరు మృతి

అన్నీ చూడండి

10-07-2025 గురువారం మీ రాశి ఫలితాలు.. రుణ సమస్యలు వేధిస్తాయి..

శబరిమల యాత్ర సజావుగా సాగేలా చూడాలి.. అలాంటివి జరగకూడదు: కేరళ మంత్రి

09-07-2025 బుధవారం ఫలితాలు - పిల్లల కదలికలపై దృష్టి పెట్టండి...

08-07-2025 మంగళవారం ఫలితాలు - తొందరపాటు నిర్ణయాలు తగవు....

ఈ పంచ కన్యల శ్లోకం స్మరిస్తే మహాపాతకాలు పోతాయ్

తర్వాతి కథనం
Show comments