శ్రీవారి బ్రహ్మోత్సవాల నాటికి భూలోక నందనవనంగా తిరుమల... చిరుతలు అందుకే వస్తున్నాయ్...

తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాల నాటికి భూలోక నందనవనంగా తిరుమలను రూపొందించాలని ఈవో అధికారులను కోరారు. తిరుమల సుందరీకరణలో భాగంగా శ్రీవారి ఆలయం ముందు భాగాంలో ప్రహరి ఉద్యానవనాల తరహాలో తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో, భక్తులు ఎక్కువగా సంచరించే ప్రాంతా

మంగళవారం, 26 జులై 2016 (19:51 IST)
తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాల నాటికి భూలోక నందనవనంగా తిరుమలను రూపొందించాలని ఈవో అధికారులను కోరారు. తిరుమల సుందరీకరణలో భాగంగా శ్రీవారి ఆలయం ముందు భాగాంలో ప్రహరి ఉద్యానవనాల తరహాలో తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో, భక్తులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తిరుపతిలోని శ్వేతాలో తితిదే ఉద్యోగులకు పరాకామణి, విడిది, దర్శనం, లడ్డూ, కల్యాణకట్ట, శ్రీవారిసేవ, తదితర అంశాలపై సిబ్బందికి శిక్షణ ఇవ్వలని సూచించారు. 
 
శిక్షణకు సంబంధించి మాడ్యుల్స్‌ తయారుచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రూ.300/- శీఘ్ర దర్శనం టికెట్లతో దర్శనం చేసుకున్న భక్తుల నుండి ఫీడ్‌బ్యాక్‌ రిపోర్టు సేకరించాలని అధికారులను కోరారు. దర్శన సౌకర్యాలపై భక్తుల అభిప్రాయం తెలుపవలసిందిగా ఎస్‌.ఎమ్‌.ఎస్‌. పంపాలని ఇడిపి అధికారులను ఆదేశించారు. తిరుమలలో వసతి గృహాలు, తాగునీరు, స్నానానికి వేడినీరు అందుబాటులో ఉంచడంతో పాటు కొళాయిలు, వాష్‌బేషిన్‌లు, విద్యుద్దీపాలు తదితరాల మరమ్మతులను పూర్తిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
 
వర్షాకాలం రానుండటంతో డ్రైనేజ్‌ మరమ్మతులు, దోమల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కల్యాణకట్టలో భక్తులకు మరింత ఉపయోగకరంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. రూ300/- తరహాలో దివ్యదర్శనం కాంప్లక్స్‌ను త్వరగా పూర్తిచేయాలని ఇంజినీరింగ్‌ ఆధికారులను ఆదేశించారు. 
 
వ‌న్య ప్రాణులు జనావాసంలోకి రాకుండా చర్యలు: 
తిరుమలలో జనవాసాలలోనికి ఇటీవల కాలంలో తరచు చిరుతపులులు వస్తున్న తరుణంలో వసతిగృహాలు వెనుక తితిదే అటవీశాఖ, ఇంజినీరింగ్‌ అధికారులు సమన్వయంతో పటిష్ఠమైన పెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులు, తిరుమలలోని హోటల్స్‌ వారు తినుబండారాల వ్యర్ధాలను లోయలో వేయడం వల్ల, వాటిని తినడానికి వన్య ప్రాణులు వస్తున్నాయని, వీటిని వేటాడేందుకు చిరుత పులులు వస్తున్నట్లు తెలిపారు. కావున భక్తులకు, తిరుమలలోని హోటల్స్‌ నిర్వాహకులకు అవగాహన కల్పించాలని ఆయన ఆరోగ్యశాఖ, విజిలెన్స్‌ అధికారులను ఆదేశించారు.
 
ఈ సమావేశంలో తిరుమల జెఈవో  కె.యస్‌.శ్రీనివాసరాజు, చీఫ్‌ ఇంజినీర్‌  చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు ఎఫ్‌ఏ అండ్‌ సిఏవో బాలాజి, ఎస్‌ఇ-2 శ్రీరామచంద్రారెడ్డి, ముఖ్య భద్రతాధికారి రవీంద్రారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో కోదండరామారావు, ఆరోగ్యశాఖాధికారి ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

అన్నీ చూడండి

బెంగుళూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలపై సీఎం విజయ్ దృష్టి!

ఎబోలా వైరస్ విజృంభణ : ఆ నాలుగు దేశాలకు వెళ్లవద్దంటున్న భారత్

హర్మోజ్‌ను తెరుస్తాం.. ఆంక్షలు ఎత్తివేయండి : ఇరాన్ సరికొత్త ప్రతిపాదన

జగన్‌.. గత చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది... బీటెక్ రవి వార్నింగ్

కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది - మోడీ వరుస విజయాలకు కాంగ్రెస్ అసమర్థత : ఉదయనిధి స్టాలిన్

అన్నీ చూడండి

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

24-05-2026 నుంచి 30-05-2026 వరకు ఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

23-05-2026 శనివారం ఫలితాలు.. దంపతుల మధ్య అకారణ కలహం

Lakshmi Puja: శుక్రవారం, శుక్రపూజ.. లక్ష్మీపూజ చేస్తే?

తిరుమలలో భారీ రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటలు.. ఎండల్ని లెక్కచేయకుండా..

తర్వాతి కథనం
Show comments