శ్రీవారి భక్తులకు శుభవార్త.. త్వరలో యాప్ ద్వారా శ్రీవారి దర్శన టిక్కెట్లు

తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తుల కోసం కొన్ని ప్రత్యేక యాప్‌లను రూపొందించనుంది. కేవలం ఇప్పటివరకు విఐపిలకు మాత్రమే అందుబాటులో ఉండే స్వామివారి సేవా టిక్కెట్లను సామాన్యులకే అందేలా చర్యలు తీసుకుంటోం

గురువారం, 19 జనవరి 2017 (10:27 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తుల కోసం కొన్ని ప్రత్యేక యాప్‌లను రూపొందించనుంది. కేవలం ఇప్పటివరకు విఐపిలకు మాత్రమే అందుబాటులో ఉండే స్వామివారి సేవా టిక్కెట్లను సామాన్యులకే అందేలా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా సేవా టిక్కెట్లను అందిస్తున్న తితిదే మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. అదే ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునేలా ప్రత్యేకమైన యాప్.
 
నిజంగా ఇది శ్రీవారి భక్తులకు శుభవార్తే. త్వరలో యాప్ ద్వారా శ్రీవారి దర్శన టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తితిదే ఈఓ సాంబశివరావు తెలిపారు. శ్రీవారి యాప్ పేరుతో గదులు, టిక్కెట్లు బుక్ చేసుకోవడం మరింత సులభతరం అవుతుంది. 
 
ఇప్పటికే ఈ యాప్‌ను తితిదే సిద్ధం చేసిందట. త్వరలో భక్తులకు అందుబాటులోకి వస్తే ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ.. తితిదే వసతి సముదాయాల చుట్టూ భక్తులు తిరగాల్సిన అవసరం లేదు. నేరుగా యాప్ ద్వారా ఏది కావాలంటే అది దొరికే వీలుంది. అలాగే ఆన్‌లైన్‌‍లో 30 0రూపాయల టిక్కెట్ల సంఖ్యను ఆరు నుంచి పదికి పెంచుతూ తితిదే నిర్ణయం తీసుకుంది. 

అన్నీ చూడండి

అనకాపల్లి జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు కార్మికుల మృతి

తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్

ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ముజిగల్ అకాడమీ కూకట్‌పల్లి 700 మంది విద్యార్థుల నమోదు

లక్నోలోని కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం.. 14మంది విద్యార్థులు మృతి (video)

తెలంగాణ పట్ల వైరం లేదు.. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించడమే లక్ష్యం.. బాబు

అన్నీ చూడండి

23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

సత్వ గుణం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందేమిటి?

21-06-2026 నుంచి 27-06-2026 వరకు వార ఫలితాలు - మీ మాటకు తిరుగుండదు

తర్వాతి కథనం
Show comments